౼ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఘాటుగా సమాధానమిచ్చిన శేరి సతీష్ రెడ్డి
౼ హౌసింగ్ బోర్డ్ ను సృష్టించింది నువ్వా? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమా.!
౼ టిడిపి నుండి టిఆర్ఎస్ లో చేరి కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం శుద్ధిచేటు. టీఆర్ఎస్ లో చేరిన మీరు ఎమ్మెల్యేల ఫిరాయింపు పై మాట్లాడే అర్హత ఉందా? దమ్ముంటే ముందు మీరు రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిచి చూపండి ఖాళీ స్థలాలు కబ్జా చేద్దామని ప్రయత్నిస్తున్నారా?
౼ కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్
మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి.
హౌసింగ్ బోర్డ్ స్థలాలు మీ తాతల జాగిర?
భారతీయ వెలుగు కూకట్ పల్లి;
కాంగ్రెస్ పార్టీ వాళ్లను దొంగలంటూ సంబోధించడం సరికాదు.1969 లో హౌసింగ్ బోర్డ్ ప్రారంభించి 1979లో నిర్మాణాలు ప్రారంభించింది.కాంగ్రెస్ ప్రభుత్వంలో వేలాది ఇల్లు నిర్మించింది.టిడిపి అధికారంలోకి రాగానే వేలం ద్వారా ప్లాట్ల అమ్మకం ప్రారంభించింది. హౌసింగ్ బోర్డ్ స్థలాలు వేలం వేసిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే,టిడిపిలో అప్పుడు మీరు మున్సిపల్ వైస్ చైర్మన్ కాదా.?
పేద, మధ్యతరగతి వారికి తక్కువ ధరకే వాయిదాల పద్ధతిలో ఇల్లు కేటాయించి రాష్ట్రంలో లక్షలాది మందికి సొంత ఇంటి కల నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ తాజాగా కూకట్పల్లి నియోజక వర్గంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మారవరం స్పందించిన తీరు పై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధన అతిక్రమించి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై నట్ట ప్రకారం ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటే కూకట్ పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఇలాంటి ఇబ్బంది. వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
1969లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూకట్పల్లి ప్రాంతంలో హౌసింగ్ బోర్ట్ ద్వారా 1300 ఎకరాలకు పైగా స్థలాన్ని సేకరించి 1970లో అప్పటి ముఖ్య మంత్రి మర్రి చెన్నారెడ్డి హయంలో భరత్ నగర్ నుండి మొదలుకొని కూకట్ పల్లి కాలనీలో నిర్మాణాల ప్రారంభించారు. తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి హయంలో ఒక నిర్మాణం సైతం నిర్మించలేదు. అంతేకాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాయంలో మలేషియన్ టౌన్ని పేరిట నిర్మించిన విజయం సంస్థకు 37 ఎకరాలు కేటాయించింది నిజం కాదా మసీదులు, చర్చ్ లకు ప్రభుత్వం అరుపడని, హౌసింగ్ బోర్డ్ స్థలం ప్రభుత్వ ధన నిర్ణయించిన నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లిస్తే ఉందన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఇంకా టిడిపి వాసన పోలేదని, గెలుపొంది టీఆర్ఎస్లోకి వెళ్లి టిడిపి నాయకులతో దోస్తానా చేస్తున్న మీకు కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ముందు ఎమ్మెలే పదవికి రాజీనామా చేసి తిరిగి గెలిచే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కొన ఊపిరితో ఉందని అందుకే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వంపై బొంగలు అంటూ పరుష పదజాలంతో మాట్లాడడం ఆయన దివాళకోరు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ దుకాణం బందు కావడం కాయమని భావించి 1999లో అభివృద్ధి చేశానని చెబుతూ తిరిగి టిడిపిలోకి వెళ్తావా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అసభ్య పదజాలంతో విమర్శిస్తే భవిష్యత్తులో రాజకీయ పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.