ఏసీబీకి పట్టుబడ్డ గచ్చిబౌలి ఏడిఈ సతీష్ కుమార్
భారతీయ వెలుగు ప్రతినిధి శేరిలింగంపల్లి
అడ్డదారుల సంపాదించాలని ఒకేసారి కోటీశ్వరులు కావాలన్నా ఆలోచనలతో ఓ అధికారి అవినీతికి పాల్పడి అడ్డంగా బుక్కయ్యాడు గచ్చిబౌలి విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. 75 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన ఏ డి ఈ సతీష్ కుమార్. ట్రాన్స్ ఫార్మర్ మంజూరు కోసం ఏడిఈ సతీష్ కుమార్ 75 వేల రూపాయలు డిమాండ్ చేయగా వినియోగదారుల నుండి ముందే 25 వేల రూపాయలు తీసుకున్నారు. వినియోగదారుడు ఈ విషయంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. చాకచక్యంగా శుక్రవారం రోజు మరో 50 వేల రూపాయలు తీసుకుంటున్న ఏడిఈ సతీష్ కుమార్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.